CM Jagan : వ‌ర‌ద‌ల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశాలు

అమరావతి: గోవదారి వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Ys Jagan Meeting

Ys Jagan Meeting

అమరావతి: గోవదారి వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో గోదావరికి నీటి ప్రవాహం, ప్రజల తరలింపు, ఇతర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీసి, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ వంటి సహాయక బృందాలను ఉపయోగించుకోవాలని ఆయన వారికి సూచించారు. సహాయక శిబిరాల ఏర్పాటులో తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండావరద బాధిత కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఇందులో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో పప్పు, 1 కిలో బంగాళదుంపలు, 1 కిలో పామాయిల్ మరియు 1 కిలో ఉల్లిపాయలు ఉన్నాయి. అలాగే సహాయక శిబిరాల నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.2000 అందించాలని చెప్పారు. ప్రతి గంటకు వరద పరిస్థితిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం సమీపంలోని దోవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం శనివారం ఉదయం 24 లక్షల క్యూసెక్కుల మార్కును దాటింది

  Last Updated: 16 Jul 2022, 02:21 PM IST