Delhi Floods: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నదీ పొంగడంతో వర్షపు నీరు ఢిల్లీలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. అయితే ఈ రోజు యమునా నది నీటిమట్టం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. అయితే వరదల దృష్ట్యా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వరద బాధితుల సహాయార్థం అన్ని జిల్లాల్లో అదనపు అధికారులను నియమించారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వరద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. యమునా నది నీటిమట్టం తగ్గిన తర్వాత నీటిని తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహాయక చర్యలు చేపట్టింది.
Read More: Congress-Uniform Civil Code : యూసీసీపై కాంగ్రెస్ వైఖరి చెప్పేది అప్పుడేనట !?