తెలంగాణ హైకోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం 5 గంటలకు 32 జ్యుడీషియల్ కోర్టులను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 9.30 గంటలకు హైకోర్టులో సీజే సతీష్ చంద్రశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరు కావాలని రిజిస్ట్రార్ జనరల్ కె సుజన పిలుపునిచ్చారు.