Chiru and Mahesh: తారలు విదేశీ యాత్రలు!

నిత్యం కెమెరా, లైట్స్ మధ్య గడిపే మన తారలు కూడా వెకేషన్ కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - May 3, 2022 / 04:10 PM IST

నిత్యం కెమెరా, లైట్స్ మధ్య గడిపే మన తారలు కూడా వెకేషన్ కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కొద్దిసేపు సినిమాలను పక్కనపెట్టి సరదాగా గడుపుతుంటారు. అందుకే ఏదైనా సినిమా షూటింగ్ పూర్తికాగానే మన హీరోలు వెంటనే ఏ స్విట్జర్లాండ్ కో, యూఎస్ కో వెళ్తుంటారు. ఇటీవల ఆచార్యతో మనముందుకొచ్చిన చిరంజీవి, త్వరలో  ‘సర్కారువారిపాట’తో మనముందుకు రాబోతున్న మహేశ్ ప్రస్తుతం హాలిడే టూర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

మహేష్ బాబు భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి ప్యారిస్ లో విహరిస్తున్నాడు. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ పర్ఫెక్ట్ ట్రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక మహేష్ సర్కారు సినిమా రిలీజ్ తర్వాత వెంటనే మరో సినిమ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఖలేజా, అతడు వంటి సినిమాలొచ్చాయి.

వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త తీసుకున్నాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్‌  తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అభిమానులు, చిరు కూతుళ్లు ఎంజాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.