Site icon HashtagU Telugu

Chhattisgarh Encounter: మావోయిస్టు అగ్రనేత శంకర్‌రావుతో పాటు మరో 29 మంది మృతి!

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని మాట్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శంకర్ రావు అనే నాయకుడు సహా దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఏడు ఏకే-47 రైఫిళ్లు, మూడు ఎంఎంజీలు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

We’re now on WhatsAppClick to Join

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 10 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. సీనియర్ పోలీసు అధికారి ఐకె ఎలెసెలా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎన్‌కౌంటర్ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగిందని చెప్పారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: Hyderabad: షీటీమ్స్ ఆపరేషన్.. మహిళలను వేధిస్తున్న 122 మంది పట్టివేత