Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..38 మంది మావోలు మృతి

Encounter : భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది

Published By: HashtagU Telugu Desk
Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కరెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌(Encounter )లో 38 మంది మావోయిస్టులు మృతి(28 Maoists killed)చెందారు. భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఎదురైన కాల్పుల్లో మావోయిస్టులు బలయ్యారు. ఈ ఘటన ములుగు మరియు సుక్మా జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. సమాచారం మేరకు మృతుల్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Jadeja: బీసీసీఐ కొత్త నియమం.. జడేజాకు ఝలక్ ఇచ్చిన అంపైర్!

“ఆపరేషన్ కరెగుట్ట” అనే పేరుతో భద్రతా బలగాలు గత కొన్నిరోజులుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టుల గూళ్లపై దాడులు నిర్వహించి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలకు ఎదురు దాడులు చేపట్టగా ఘర్షణ తలెత్తింది. ఎదురుకాల్పులు గంటల తరబడి కొనసాగినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై మావోయిస్టుల శిబిరం నుంచి స్పందన కూడా వచ్చినట్టు సమాచారం. భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు మాత్రం కీలక నేతల్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనతో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టంగా మారింది.

  Last Updated: 26 Apr 2025, 01:54 PM IST