Gold- Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఊరట..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్వల్పంగా తగ్గాయి.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 07:26 AM IST

Gold- Silver Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,160గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.79,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (సెప్టెంబర్ 06, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Junior Translator Posts: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ చేసిన వారు అర్హులు..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,310గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,160 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,200 ఉండగా, ముంబైలో రూ.75,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, కోల్‌కతాలో రూ.75,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,500 ఉండగా, కేరళలో రూ.79,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, విజయవాడలో రూ.79,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.