Gold Rates: ఈరోజు భారీగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు భారీగా పెరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Sovereign Gold Bond

Gold Price

Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,530గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.75,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (అక్టోబర్ 11, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Drugs : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

We’re now on WhatsApp. Click to Join.

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,680గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,690గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.58,530 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,600 ఉండగా, ముంబైలో రూ.72,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500 ఉండగా, కోల్‌కతాలో రూ.72,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కేరళలో రూ.75,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500 ఉండగా, విజయవాడలో రూ.75,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 11 Oct 2023, 07:03 AM IST