Gannavaram : వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలి – టీడీపీ అధినేత చంద్ర‌బాబు

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌ల దాడిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని

  • Written By:
  • Publish Date - February 20, 2023 / 08:09 PM IST

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌ల దాడిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమంటూ చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని.. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? అని ప్ర‌శ్నించారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణన‌ని… రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని..కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.