భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదించింది. అత్యవసర పరిస్థితుల్లో 18 ఏళ్లు పైబడిన వారిలో కోవిడ్-19 నియంత్రణకు వ్యాక్సిన్ వేయడానికి CDSCO అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో, “ఈ చర్య మహమ్మారికి వ్యతిరేకంగా మన సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది. PM నరేంద్ర మోడీ నాయకత్వంలో కోవిడ్-19కి వ్యతిరేక పోరాటంలో భారతదేశం సైన్స్, మానవ వనరులను ఉపయోగించుకుంది. సైన్స్ ఆధారిత విధానం, సబ్కా ప్రయాస్తో కోవిడ్-19ని ఓడిస్తాము.` అంటూ ట్వీట్ లో పొందుపరిచారు.