CBI : లంచం కేసులో సౌత్ సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ఇంజ‌నీర్ అరెస్ట్‌

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 04:20 PM IST

హైదరాబాద్: సౌత్ సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ఇంజ‌నీర్ పీఆర్ సురేష్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఒక కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేసి, తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసింది. ఉప్పల్‌-జమ్మికుంట రైల్వే మధ్య రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్ట్‌ నుంచి రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు వ‌చ్చాయి. నాచారంలోని అతని నివాసంలో లంచం తీసుకుంటుండా వలపన్ని సీబీఐ అధికారులు ప‌ట్టుకున్నారు.అత‌ని నివాసంలో నిన్న సాయంత్రం నుంచి సీబీఐ సోదాలు కొన‌సాగించింది. సురేష్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజ‌రుప‌రిచారు.