Road Accident: గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

గ్రేటర్ నోయిడా (Greater Noida) ఎక్స్‌ప్రెస్‌వేపై సెక్టార్-160 సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 12:03 PM IST

గ్రేటర్ నోయిడా (Greater Noida) ఎక్స్‌ప్రెస్‌వేపై సెక్టార్-160 సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురిలో 3 నెలల పాప సహా ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నాలెడ్జ్‌పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబం తమ స్విఫ్ట్ డిజైర్‌లో న్యూఢిల్లీ నుండి ఆగ్రాకు వివాహానికి హాజరయ్యేందుకు వెళుతుండగా వారి కారు గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read: 31 Killed: శాంతించని మణిపూర్.. మొత్తం 31 మంది మృతి!

గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న కారు నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండగా అందులో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే నాలెడ్జ్ పార్క్ కొత్వాలి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహ వేడుకకు హాజరైన వారంతా ఆగ్రా నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. ఇంతలో గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు నెలల చిన్నారి సహా ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు.