అగ్నిపథ్కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ఆగస్టు 7 నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలోని తిక్రీ ప్రాంతంలో రైతుల సభను ఉద్దేశించి టికైత్ మాట్లాడుతూ, ఈ సమస్యపై “కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పోరాటం ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రచారం ఆగస్ట్ 7 నుండి ప్రారంభమవుతుందని..ఒక వారం పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకే వారిపై పాత పోలీసు కేసులను తవ్వేస్తున్నారని ఆరోపించారు.