Bus Overturns: హ‌ర్యానాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మ‌ర‌ణం

హర్యానాలోని మహేంద్రగఢ్‌లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Bus Overturns

Safeimagekit Resized Img (4) 11zon

Bus Overturns: హర్యానాలోని మహేంద్రగఢ్‌లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవర్ టేక్ చేయడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

మహేంద్రగఢ్‌లోని కనీనా పట్టణంలోని జీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు గురువారం ఉదయం పిల్లలతో పాఠశాలకు వెళుతోంది. ఉన్‌హాని గ్రామ సమీపంలో పాఠశాల బస్సు ఓవర్‌టేక్ చేస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ సమయంలో భారీ పేలుడు, కేకలు వచ్చాయి.

Also Read: Mumps Infection: మ‌రో వైర‌స్ ముప్పు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్న నిపుణులు..!

స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు. బస్సు అతివేగంతో వెళ్లడంతో బ్యాలెన్స్‌ తప్పి చెట్టును ఢీకొట్టిందని ప్రజలు చెబుతున్నారు. దీంతో పెను ప్రమాదం సంభవించి పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప‌లువురు మృతిచెందారు.

We’re now on WhatsApp : Click to Join

విచారణ గురించి పోలీసులు తెలిపారు

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం బస్సులో మొత్తం 20-25 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా.. లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈద్ సందర్భంగా నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు ఉన్నాయి. అయినా ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించలేదు.

  Last Updated: 11 Apr 2024, 11:23 AM IST