Bomb Threat : తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు

Bomb Threat : తిరుపతిలోని లీలామహాల్ సమీపంలో ఉన్న మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కి గురువారం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసు అధికారులు హైఅలర్ట్ అయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు వెంటనే హోటళ్లలో అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. అధికారులు మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు, చివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ కావడంతో హోటళ్ల యజమానులు, సందర్శకులు ఊపిరిపీల్చుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tirupati Bomb Threat

Tirupati Bomb Threat

Bomb Threat : రోజు రోజుకు బాంబు బెదిరింపుల సమస్య మరింత పెరిగిపోతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కలకలం రేపుతూ పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. లీలామహాల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కి గురువారం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసు అధికారులు హైఅలర్ట్ అయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు వెంటనే హోటళ్లలో అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించాయి. అధికారులు మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు, చివరకు ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ కావడంతో హోటళ్ల యజమానులు, సందర్శకులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మెయిల్ బెదిరింపుల పై అలిపిరి, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Supreme court : గడియారం గుర్తు.. శరద్‌పవార్‌ పార్టీకి షాక్.. అజిత్ పవార్‌కు ఊరట..

ఈ నేపథ్యంలో, తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష విధింపులో తమిళనాడు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగా, తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు , పాఠశాలలు లక్ష్యంగా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ పేలుళ్ల బెదిరింపులు చేశారన్న అనుమానాలు నెలకొన్నాయి. తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో పలు హోటళ్లు కూడా పేల్చేస్తామని హెచ్చరికలు మెయిల్ రూపంలో రావడంతో భయాందోళనలకు గురయ్యారు.

ఇదే సమయంలో, తిరుపతి విమానాశ్రయంలోని స్టార్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎస్ 5 – 154 ఫ్లైట్‌కు కూడా బాంబు బెదిరింపు మెసేజ్ అందింది. అదామ్ నాన్‌జా 333 పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్‌ నుండి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. పోలీసులు ఈ మెసేజ్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల కాలంలో విమానయాన సంస్థలకు వాస్తవం కాని బాంబు బెదిరింపులు రావడం పెరిగిపోతోంది. ఈ విధమైన ఫేక్ కాల్స్ వల్ల అధికారులు అప్రమత్తమవుతుండగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనవసరమైన భద్రతా తనిఖీలు, విమాన సర్వీసులు ఆలస్యం కావడం, కొన్నిసార్లు రద్దు చేయాల్సి రావడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

Dana Cyclone : తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్‌..

  Last Updated: 25 Oct 2024, 10:17 AM IST