Belagavi Express: బెలగావి ఎక్స్‌ప్రెస్​కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు

సికింద్రాబాద్ నుంచి బెలగావి (Belagavi)వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో రైలులో తనిఖీ చేపట్టారు.

  • Written By:
  • Updated On - February 23, 2023 / 08:52 AM IST

సికింద్రాబాద్ నుంచి బెలగావి (Belagavi)వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో రైలులో తనిఖీ చేపట్టారు. బెలగావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన ఈ రైల్లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి 9.30 గంటలకు ఫోను రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రాత్రి 11.15 గంటల వరకు పరిశీలించి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Tajikistan: తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు

వాస్తవానికి ఈనెంబర్ 07335/36 గల రైలు రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామస్థుడు బాలరాజు ఆటో డ్రైవర్‌. ఓ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ రైలులో బాంబు ఉందంటూ మాట్లాడుకుంటుండగా బాలరాజు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.35 గంటల సమయంలో రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లింది. బాలరాజును విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.