BJP Chief : నేడు ఏపీలో ప‌ర్య‌టించ‌నున్న బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నేడు (సోమ‌వారం) ఏపీకి రానున్నారు. ఏపీలో బీజేపీని బ‌లోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది.

  • Written By:
  • Updated On - June 6, 2022 / 11:40 AM IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నేడు (సోమ‌వారం) ఏపీకి రానున్నారు. ఏపీలో బీజేపీని బ‌లోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది. ఈ నేప‌థ్యంలోనే న‌డ్డా ఏపీ టూర్ కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. న‌డ్డా ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11:40 వరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. 11:40 -12:10 వరకు ఎయిర్‌పోర్టు నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సభ జరిగే సిద్దార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్తారు.

అనంతరం 12:15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 02:00 వరకు బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల సభలో పాల్గొంటారు. అనంత‌రం మధ్యాహ్నం 02:00 నుంచి సాయంత్రం 05:50 నిమిషాల వరకు నోవాటెల్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 06:00 నుంచి 07:30 నిమిషాల వరకు మేధావులతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి 08:00 గంటల నుంచి 10:00 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం బీజేపీ నేతలతో కలిసి డిన్నర్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం 07:30 నిమిషాలకు విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం 08:30కి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. అయితే న‌డ్డా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బీజేపీ జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిపై జోరుగా చ‌ర్చ సాగుతుంది. బీజేపీ జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌లు ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిపై బీజేపీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.