కృష్ణాజిల్లాలో బర్త్డే వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి.కృష్ణా జిల్లా పెదవిరివాడలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కృష్ణబాబు అనే యువకుడు మద్యం మత్తులో చేపల చెరువులో పడి మృతి చెందాడు. పెదవిరివాడలో ఓ యువకుడి జన్మదిన వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెదివిరివాడకు చెందిన వెంకటనాగు అనే యువకుడి జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి చేపల చెరువుపై సరదాగా గడిపారు. అయితే బాధితుడు తాగిన మైకంలో చెరువులో పడి మృతి చెందాడు. చేపల చెరువులో కృష్ణబాబు మృతదేహం లభ్యమైంది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.