Site icon HashtagU Telugu

Bhatti : ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి

Bhatt Condolenss

Bhatt Condolenss

ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదం(Accident)లో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti ) పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకుని సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా మృతురాలి చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Varun Chakaravarthy: టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశ‌గా టీమిండియా స్పిన్న‌ర్!

ఈ సంఘటన బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ కూలీలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇతర క్షతగాత్రులను గురించి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

వ్యవసాయ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కూడా పరిశీలించారు. ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండుతుందని, ఈ విధమైన ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.