తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లాకర్ నిబంధనలను మార్చేసింది. బ్యాంకు లాకర్ సవరించిన ఒప్పందంపై ఖాతాదారులతో సంతకం చేయడానికి దేశంలోని అన్ని బ్యాంకులకు ఆర్బిఐ ఈనెల అనగా జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా తమలాకర్ల చార్జీలలో కొన్ని మార్పులను చేశాయి. ప్రతి బ్యాంకులో లాకర్ చార్జీలు దాని సైజు ప్లేస్మెంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. అయితే మరి ఏఏ బ్యాంకులు తమలాకర్లకు ఎంత వసూలు చేస్తున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వాల్యుయేషన్ పరంగా భారత్ లో అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు లాకర్ చార్జీలు రూ. 1,350 నుంచి రూ.20,000 వరకు ఉండవచ్చు. ఇది వార్షికంగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాలు పట్టణ ప్రాంతాలను బట్టి బ్యాంక్ వేరే వేరే చార్జీలను తీసుకుంటోంది. మిడ్ సైజ్ బ్యాంకు లాకర్ కు రూ. 3000, పెద్ద లాకర్ కు రూ. 7000 చార్జీ వసూలు చేస్తుంది. అలాగే మరోవైపు ఖాతాదారులకు అదనపు పెద్ద లాకర్లు అవసరమైతే వారి దగ్గర నుంచి దాదాపుగా ప్రతి ఏడాది రూ.15,000 తీసుకోనుంది. అలాగే దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినా ఐసిఐసిఐ కూడా చిన్న సైజు నుంచి మిడ్ సైజు వరకు లాకర్ లకు వివిధ రకాల చార్జీలు వసూలు చేస్తుంది.
చిన్న సైజు లాకర్లకు రూ.1200 నుంచి 5,000 వరకు వసూలు చేయనుంది. అలాగే మీడియం సైజు లాకర్లకు రూ.2,500 నుంచి 9000 వరకు వసూలు చేయనున్నారు. ఇక పెద్ద లాకర్ల కోసం బ్యాంకులో ఏడాదికి 4000 నుంచి 9000 వరకు వసూలు చేయనున్నాయి. అదేవిధంగా 40 కోట్లకు పైగా ఖాతాదారులతో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మూడు సైజుల లాకర్ల సౌకర్యాన్ని కల్పించింది. ఈ మూడు రకాల లాకర్ల చార్జీలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఎస్బిఐ వారి నగరంలో నివసిస్తున్న కస్టమర్ల నుంచి 2000 + జీఎస్టీ కూడా వసూలు చేస్తుంది. అలాగే గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతంలో నివసించే వినియోగదారుల నుంచి 1500 + జీఎస్టీ ని వసూలు చేస్తుంది. దేశంలోనే మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా కెనరా బ్యాంక్ లాకర్ బ్యాంకు కోసం కేవలం 400 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జర్ వసూలు చేస్తోంది. జీఎస్టీ మాత్రం వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. లాకర్ ను ఆపరేట్ చేయడానికి సర్వీస్ ఛార్జ్ 12 ఉపయోగాలకు ఉచితం. ఆ తర్వాత లాకర్ని ఉపయోగిస్తే ఒక్కో ఆపరేషన్ కు రూ.100 + జీఎస్టీ కూడా చెల్లించాలి.