Nizamabad: అరుదైన దృశ్యం.. బండి, కవిత ఆత్మీయ పలకరింపు

తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణలో ప్రధాన పక్షంగా చెప్పుకునే బండి సంజయ్ నిత్యం కెసిఆర్ పరిపాలనను ఎండగడుతూ ఉంటాడు

Nizamabad: తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే బండి సంజయ్ నిత్యం కెసిఆర్ పరిపాలనను ఎండగడుతూ ఉంటాడు. అయితే తాజాగా అరుదైన రాజకీయ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ రోజు నిజామాబాదులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకుని చిరునవ్వుతో కనిపించారు. ఈ దృశ్యం నిజంగా పలువురిని ఆకట్టుకుంటుంది. రాజకీయంగా ప్రత్యర్థులే అయినప్పటికీ వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ రోజు వారు నీరుపించారు.

బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నిజామాబాద్‌లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. అయితే గృహప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి, కవిత ఒకే సమయానికి గృహప్రవేశానికి హాజరయ్యారు. దీంతో ఇరువురు నేతలూ పరస్పరం తారసపడ్డారు. ఉప్పు, నిప్పులా కనిపించే వీరిద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్‌ కు పరిచయం చేశారు. అనంతరం కవిత లోపలి వెళ్లగా.. బండి బయట కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు.

Read More: Raw Mangoes: పచ్చి మామిడికాయతో క్యాన్సర్ కు చెక్ పెట్టండిలా?