Balakrishna : ఏలూరులో అభిమానులను ఉర్రూతలూగించి నందమూరి బాలకృష్ణ సందడి చేసింది. శనివారం నగరంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ ప్రముఖ నగల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఆయనతో పాటు ‘విరూపాక్ష’ ఫేం నటి సంయుక్త మీనన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. బాలయ్యను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు చేరడంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. బాలయ్య చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.
Chandrababu : జూన్ 23 నుండి “ఇంటింటికి తొలి అడుగు ” కార్యక్రమం
ఈ సందర్భంగా బాలకృష్ణ తన రాబోయే చిత్రం ‘అఖండ 2’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణం పూర్తయిందని, ఎంతో బాగా వచ్చిందని వెల్లడించారు. ఇటీవల విడుదలైన టీజర్కు ఫ్యాన్స్ నుండి భారీ స్పందన రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ను సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా, ఈ ప్రారంభోత్సవంలో ఓ హార్ట్ టచింగ్ మోమెంట్ చోటు చేసుకుంది. నటి సంయుక్త మీనన్, బాలయ్య పట్ల గౌరవ సూచకంగా ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడి వారిని కట్టిపడేసింది. బాలకృష్ణ మొదట స్వల్పంగా ఆశ్చర్యపోయినా వెంటనే స్పందిస్తూ “దీర్ఘాయుష్మాన్ భవ” అంటూ ఆమెను ఆశీర్వదించారు. ఈ ఉదంతం అక్కడున్నవారికి అద్భుతంగా అనిపించగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ దృశ్యాలను ఎంతో ప్రేమగా పంచుకుంటున్నారు. బాలయ్య అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రేమికులంతా ఈ మధుర సన్నివేశానికి ఫిదా అయ్యారు.
Good News : ఏపీలోని చేనేత కార్మికులకు శుభవార్త
Back to Hyderabad ❤️❤️ pic.twitter.com/H4AjkWRqlE
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) June 13, 2025