Delhi: శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 18 విమానాలను దారి మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు. విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్సర్లకు మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.
అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం సైతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చినా ప్రజలు, రైతులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నేటికి పంజాబ్ రైతులు తమ పంటలను తగులబెడుతూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.