Mancherial: మంచిర్యాలో దారుణం.. శిశువు మృతదేహాన్ని తినేసిన కుక్కలు

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 07:21 PM IST

Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌ గ్రామానికి చెందిన గంగక్క అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురికి ఇటీవల వివాహం జరిగింది. ఇక రెండో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. అయితే గంగక్కకు మాత్రం కొడుకు కావాలనే ఆశ ఉండేది. ఈ క్రమంలో మగ శిశువు కోసం ఎదురుచూసిన గంగక్క మరోసారి గర్భందాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

మూడోకాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. మరోవైపు పెండ్లయిన కూతురుండగా, తాను మళ్లీ గర్భం దాల్చడం అవమానంగా భావించింది. అంతే చడీచప్పుడు చేయకుండా పురిటి బిడ్డను గ్రామ శివారులోని పొలాల్లో పడేసిందఉదయం శిశువు మృతదేహాన్ని కుక్కలు గ్రామం దగ్గరికి లాక్కొచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గంగక్కే తన బిడ్డను ఈ విధంగా ఆడ శిశువును కుక్కలపాలు చేసి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.