రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి హాజరు కానున్నారు. ఆ సమావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, లెప్ట్ నెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో ఈనెల 6వ తేదీన జరగనుంది. ఆ సమావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, సెలబ్రిటీలు, దేశంలోని వివిధ పార్టీల సీనియర్లు పాల్గొంటారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఆ వేడుకలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. అదే సమావేశానికి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. వాళ్లిద్దరూ ఒకే సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఈనెల 6వ తేదీన ఢిల్లీలో జగన్ బిజీబిజీగా గడపనున్నారు.