ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మే 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్ధ సంవత్సర(హాఫ్ ఇయర్) పరీక్షలు నిర్వహించిన అధికారులు.. బోర్డు పరీక్షలపై దృష్టిసారించారాని బోర్డు వర్గాలు తెలిపాయి. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని.. ఆ సమయంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.