Site icon HashtagU Telugu

India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్

Template (45) Copy

Template (45) Copy

కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది. పాత, తుక్కు సామానును సేకరించిన రూపొందించిన ఓ చిన్న నాలుగు చక్రాల వాహనం కుమారుడి సంతోషాన్నే కాదు.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ, మహీంద్రా యజమాని ఆనంద్ మహీంద్రా మనుసునూ గెలుచుకుంది.

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా కడేగావ్ కు చెందిన దత్తాత్రేయ కులవృత్తితో జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అతడి కుమారుడు ‘నాన్నా మనం కారు కొనుక్కొందాం’ అని అడిగాడు. కారును కొనే స్తోమత కూడా లేకపోవడంతో.. విడిభాగాలను, ఇతర మెటీరియల్ ను తుక్కు సామాను విక్రయించే కేంద్రాల నుంచి సేకరించి తానే సొంతంగా ఒక జీప్ ను పోలిన కారును తయారు చేశాడు.

ఎడమవైపు స్టీరింగ్ తో ఉండే ఈ బుల్లి జీప్ ఇంజన్ కు స్కూటర్ మాదిరే కిక్ రాడ్ తో స్టార్ అయ్యే ఏర్పాటు చేశాడు దత్తాత్రేయ. ఈ వాహనం నిమిషానికి 45 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ, లీటర్ పెట్రోల్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోందట. కార్లలో ఏదీ కూడా ఇంత మైలేజీనివ్వదు.

ఈ ఆవిష్కరణ ఏదోలా ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఇంకేముంది ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘నిబంధనలకు అనుగుణంగా ఈ వాహనం లేదు కనుక స్థానిక అధికారులు ఇప్పుడో, లేదా తర్వాతే దీన్ని నిలిపివేస్తారు. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను.. అతడు తన కారును నాకిస్తే కొత్త బొలెరో ఇస్తాను. అతడి ఆవిష్కరణను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శిస్తాం. అది మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సమృద్ధి వనరులు అంటే అర్థం.. తక్కువ వనరులతోనే ఎక్కువ ఆవిష్కరణ చేయడం అని’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.