Hyd Minor Rape : గ్యాంగ్ రేప్ పై ఆనంద్ మహేంద్ర ట్వీట్

  • Written By:
  • Publish Date - June 4, 2022 / 10:34 AM IST

హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ పై ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు. పలుకుపడి ఉన్న కుటుంబాల పిల్లలు అంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.అమ్నీషియా పబ్ బాలిక అత్యాచార ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్ మహీంద్రా.ప్రతిపక్ష పార్టీలు సంచలన ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంచలనంగా మారిన ఈ ఘటనపై వస్తున్న వార్తలపై స్పందించిన మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అత్యాచారానికి పాల్పడిన యువకులను పలుకుబడి ఉన్న కుటుంబాల వారు అని వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆమ్నీషియా పబ్ బాలిక సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. పబ్ కి వెళ్లిన 17 సంవత్సరాల బాలికను , అక్కడి నుండి బెంజ్ కారులో తీసుకువెళ్లి నలుగురు యువకులు, కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అంతేకాదు హైదరాబాద్లో బాలికపై ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేషన్ చైర్మన్ కుమారుడు, హోం మంత్రి మనవడు ఇలా పలుకుబడి ఉన్న కుటుంబాలు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని వార్తలు రావడంతో దీనిపై అందరి దృష్టి ప్రధానంగా నెలకొంది.
ఆమ్నీషియా పబ్ బాలిక సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. పబ్ కి వెళ్లిన 17 సంవత్సరాల బాలికను , అక్కడి నుండి బెంజ్ కారులో తీసుకువెళ్లి నలుగురు యువకులు, కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.