తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో భర్త గౌతమ్ , తల్లి వినయ్ అగర్వాల్తో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయవేద పండితులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.