పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తరన్ తరణ్ జిల్లాలో శనివారం ఉదయం స్కూల్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. చిన్నారిని ఉస్మాలోని మై భాగో ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. విద్యార్థి పేరు సీరత్ పాల్ కౌర్. డ్రైవర్ను రణధీర్ సింగ్గా గుర్తించారు. అమృత్సర్-భటిండా హైవేపై ఈ ప్రమాదం జరిగింది.