ఇటీవల కాలంలో చాలామంది కష్టపడడానికి ఇష్టం లేక దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలు కూడా ఏకంగా పోలీసులకే చాలెంజ్ విసురుతూ సరికొత్త విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి అలాంటి పనే చేశాడు. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సుధీర్ జల్సాలకు బానిస అయ్యాడు. ఏ పనీ చేయకుండా తిరుగుతూ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఎలాంటి అనుమానం రాకుండా లేడీ డ్రెస్ వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణం నడుపుతున్నాడు. సుధీర్ తన భార్యతో కలిసి షాపులోని బేస్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 9న దుకాణానికి తాళం వేసి లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లాడు. మర్నాడు ఉదయం 11 గంటలకు షాపు వద్దకు వచ్చి చూడగా వెనుక తలుపు తెరిచి ఉన్నాయి. కౌంటర్లో రూ.3,500 నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకుని పలు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు.
అందులో ఒక యువతి చోరీకి పాల్పడుతున్నట్లుగా కనిపించింది. ముందుగా దుకాణం ఉన్న భవనంలో నివసిస్తున్న వారిని పరిశీలించారు. సుధీర్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులో తీసుకుని తనదైన శైలిలో చర్చించుకున్నారు. దీంతో నేరం అంగీకరించాడు. దొంగతనం వచ్చింది లేడీ కాదని తానే తన భార్య డ్రెస్, సవరం ధరించి దొంగతానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.