Constable Suicide: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు. తన గన్ తో తానే కాల్చుకొని కానిస్టేబుల్ బాలేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట్ మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యకు ముందు హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానాలో బాలేశ్వర్ విధులు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆదివారం తెల్లవారుజామున తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: KTR Fire: అది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ: KTR
సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఘటనా స్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా..? ఆర్థిక సమస్యలా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp : Click to Join