Road Accidents In UP : యూపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5గురు మృతి

యూపీలోని ఘజియాబాద్‌లో వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. వేగంగా వచ్చిన అంబులెన్స్ .. రెండు...

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 07:55 AM IST

యూపీలోని ఘజియాబాద్‌లో వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. వేగంగా వచ్చిన అంబులెన్స్ .. రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మన్మోహన్ (34), రిషిపాల్ (32), రాజ్ కుమారి (54) రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్నారని ఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం రాత్రి సిద్ధార్థ్ విహార్ సమీపంలో అంబులెన్స్ వీరిని ఢీకొట్టింది. అంబులెన్స్‌ డ్రైవర్‌ వినిత్‌ దేశ్‌పాల్‌ను అరెస్ట్‌ చేశామని, అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. అదే రోజు రాత్రి జరిగిన రెండో ప్రమాదంలో.. వసుంధర సమీపంలో రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు డెంటల్ విద్యార్థులు మరణించారు. వారిని అరుణాచల్ ప్రదేశ్ వాసులు డుజు సోలోమన్ (19), గ్యాతి టాజో (19)గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు.