ఎన్ కౌంటర్ లతో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుంటే మరోవైపు పోలీసుల ఎదుట నక్సల్స్ లొంగిపోతుండటం మవోయిస్టు పార్టీలో అలజడి రేపుతుంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని చింతల్నార్ ప్రాంతంలోని ఒక గ్రామంలో శనివారం తొమ్మిది మంది మహిళా క్యాడర్లతో సహా 44 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కరిగుండంలోని పోలీసు క్యాంపు వద్ద సుక్మా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ శర్మ ఎదుట నక్సల్స్ లొంగిపోయారు.
వీరిలో ఒకరిపై రూ.2 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ శర్మ తెలిపారు.లొంగిపోయిన తర్వాత పోలీసులు నక్సల్స్కు విందు కూడా ఏర్పాటు చేశారు.