Covid19: 29 జిల్లాల్లో జీరో కరోనా కేసులు

తెలంగాణలో ఆదివారం 21 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

  • Written By:
  • Updated On - April 25, 2022 / 03:54 PM IST

తెలంగాణలో ఆదివారం 21 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 17 హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.06%. ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,91,793కి చేరుకుంది. మొత్తం 19 మంది రోగులు కోలుకున్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 213 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 99.45% కాగా, మరణాల రేటు 0.51%. ఆదివారం మొత్తం 10,132 నమూనాలను పరీక్షించారు. హైదరాబాద్, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ మినహా మిగిలిన 29 జిల్లాల్లో జీరో కేసులు నమోదయ్యాయి.