Bus Accident: జ‌మ్ము కాశ్మీర్‌లో బ‌స్సు బోల్తా.. 25 మందికి గాయాలు

జ‌మ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 12:36 PM IST

జ‌మ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు. ఉదంపూర్ జిల్లాలోని జమ్మూ కాశ్మీర్ హైవే వెంబడి బట్టల్ బల్లియన్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో సుమారు 25 మంది ప్రయాణికులు గాయపడిన‌ట్లు సమాచారం శనివారం జమ్మూ నుంచి వస్తున్న బస్సు దోడా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఉదంపూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురిని జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.