Site icon HashtagU Telugu

Tamil Nadu: తమిళనాడులో విషాదం: బాణాసంచా పేలి ఇద్దరు మృతి

Tamil Nadu

New Web Story Copy 2023 05 18t190649.373

Tamil Nadu: వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ అవకాశముంది. ఈ మధ్య అలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. విరుదునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన కుమరేశన్, సుందరరాజన్ మృతి చెందారు.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విరుదునగర్ జిల్లాలోని శివకాశి నగరం భారతదేశంలో బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

Read More: Sikkim Bus Accident: సిక్కింలో బస్సు బోల్తా… 26 మంది విద్యార్థులకు గాయాలు