Site icon HashtagU Telugu

Gang Rape: 19 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులు అత్యాచారం

Gang Rape

Gang Rape

Gang Rape:: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు 20 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణం ఏంటంటే ఈ అత్యాచార ఘటనలో ఇద్దరు మహిళలు కూడా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మొత్తం ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌హెచ్‌ఓ అనూప్ శర్మ తెలిపారు.

యువతిని మొహమ్మద్ అర్షద్ మరియు అసిమ్ సెప్టెంబర్ 27 న కిడ్నాప్ చేశారు.ఇద్దరూ ఆమెకు మత్తుమందు ఇచ్చి మొరాదాబాద్ జిల్లాలోని తమ స్నేహితుడు ఆషిక్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు.తరువాత సోనీ హుస్సేన్ మరియు ఫైజ్ ఆలం కూడా చేరి ఆమెపై అనేకసార్లు అత్యాచార దాడికి పాల్పడ్డారు. నిందితులకు సైరా బేగం, జెబా ఖాన్ అనే ఇద్దరు మహిళలు తోడుగా ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అక్టోబరు 12న తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చానని ఆమె తెలిపారు.

ప్రాణాలతో బయటపడిన ఆమెను వైద్య పరీక్షల కోసం పంపారు మరియు నిందితులపై CrPC సెక్షన్ 161 కింద ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను నియమించారు.ఏడుగురిపై 376డి (సామూహిక అత్యాచారం), 366 (పెళ్లి చేసుకోమని బలవంతంగా ఒక మహిళను కిడ్నాప్ చేయడం), 323 ( గాయపరచడం), 328 (మత్తు మందు ), 344 ( నిర్బంధించడం ) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద కేసులు బుక్ అయ్యాయి.

Also Read: Train Accident : విజయనగరం రైలు ప్రమాదం ఎలా జరిగింది ? రాంగ్ సిగ్నలే కారణమా ?

Exit mobile version