Site icon HashtagU Telugu

Indian Railways : 172వ వసంతంలోకి భారత రైల్వే.. చారిత్రక విశేషాలివీ

Indian Railway 172 Years History India

Indian Railways : ఈరోజు (ఏప్రిల్ 16)తో మన భారతీయ రైల్వేకు 172 ఏళ్లు. 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మన దేశంలో రైల్వే వ్యవస్థ ప్రస్థానం మొదలైంది.  ఆనాటి బ్రిటీష్ పాలకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతదేశంలోని ఖనిజ వనరులు,  మసాలా దినుసులు, విలువైన సంపదను ఓడరేవుల వరకు చేరవేసేందుకు రైల్వే లైన్లను వేశారు.

Also Read :Waqf Act : ఆలయ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా ? ‘వక్ఫ్’పై కేంద్రానికి సుప్రీం ప్రశ్న

తొలి రైలు జర్నీ ఇలా.. 

భారతదేశంలో తొలి రైలు(Indian Railways)  1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్‌ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది. ఆ రైలుకు ఆనాడు బ్రిటీష్ పాలకులు 21 తుపాకీ గుంజులతో సెల్యూట్‌ సమర్పించారు.  ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ తొలి రైలు సర్వీసులో 400 మంది ఆహ్వానిత అతిథులు ప్రయాణించారు. ఆ ట్రైన్‌ను ‘సింద్’, ‘సుల్తాన్’, ‘సాహెబ్’ అనే పేర్లున్న మూడు ఇంజిన్లు కలిసి లాగాయి. 34 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో ఈ రైలు చేరుకుంది.

Also Read :Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?

భారత రైల్వే అంచెలంచెలుగా అప్‌డేట్