ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుటాయి. అవన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సూర్యుడు చుట్టూ తిరిగే ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో కనిపించనున్నాయి. బుధుడు.. శుక్రుడు ..అంగారకుడు ..బృహస్పతి.. శని గ్రహాలు రేపు అంటే శుక్రవారం ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ 5 గ్రహాలు 2004 డిసెంబర్ లో ఇలా ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేశాయి. 18 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు. ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు.గంట సమయం పాటు ఈ 5 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. దీన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు టెలిస్కోప్ బైనాక్యులర్ అవసరం లేకుండానే నేరుగా చూడొచ్చు.