Site icon HashtagU Telugu

Engineers Day 2024 : ఇవాళ ఇంజినీర్స్ డే.. ది గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలివీ

Engineers Day 2024 Mokshagundam Visvesvaraya

Engineers Day 2024 : ఇవాళ (సెప్టెంబరు 15) జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటారు.  ఆయన 1861 సెప్టెంబరు 15న కర్ణాటకలోని ముద్దనేహళ్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. మైసూర్‌లోని ప్రసిద్ధ కృష్ణ రాజ సాగర డ్యామ్‌ సహా అనేక గుర్తింపు పొందిన బ్యారేజీల  నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భాగస్వామిగా ఉన్నారు. డెక్కన్ పీఠభూమికి నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిజాం నవాబుల కాలంలో 1909 సంవత్సరంలో హైదరాబాద్‌కు వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించడంలో విశ్వేశ్వరయ్య పాత్ర ఎనలేనిది. నేటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ఆయన ఆలోచన నుంచి వచ్చినవే. విశ్వేశ్వరయ్య  ఆనాడు చేసిన సూచనల వల్లే హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరద ముప్పు నుంచి తప్పించుకోగలిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య  మన దేశానికి అందించిన విశిష్ట ఇంజినీరింగ్ సేవలకు గుర్తుగా  ఏటా సెప్టెంబరు 15న(జయంతి రోజు) నేషనల్ ఇంజినీర్స్‌ డేగా(Engineers Day 2024) సెలబ్రేట్ చేసుకుంటాం.

Also Read :Kejriwal Resignation : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా : సీఎం అరవింద్ కేజ్రీవాల్

Also Read :Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్