Elections 2024 : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు సైతం పోల్స్ జరగనున్నాయి. ఏడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు విస్తృత స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఎన్నికల షెడ్యూల్కు.. పోలింగ్కు మధ్య గ్యాప్ ఈసారి ఎక్కువగా ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీల అధినేతలు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా పార్టీల నాయకులు హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. కొన్ని జాతీయ పార్టీలైతే కీలక నేతల పర్యటనల కోసం ప్రైవేటు విమానాలను వాడుకోనున్నాయి. చిత్రం ఏమిటంటే.. అభ్యర్థుల ప్రయాణ ఖర్చు ఎన్నికల ఖర్చులోకి(Elections 2024) రాదు. కేవలం ప్రచార ఖర్చు అంటే.. జెండాలు, ఇతరత్రా ప్రచారానికి చేసిన ఖర్చునే ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
ప్రాంతీయ పార్టీల ప్రయారిటీ ఇదీ..
చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల బుకింగ్ కోసం రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వీటికి డిమాండ్ 50 శాతం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలైతే హెలికాప్టర్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. తక్కువ సమయంలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లగలిగే సౌలభ్యం ఉన్నందున అవే బెస్ట్ అని భావిస్తున్నాయి. విమానాలు, హెలికాప్టర్లను సంబంధిత సంస్థల నుంచి రాజకీయ పార్టీలు రోజులు, వారాల ప్రాతిపదికన అద్దెకు తీసుకునేందుకు సంబంధించిన డీల్స్ కుదురుతున్నట్లు సమాచారం.
అద్దెలు ఇలా..