MP Suicide : లోక్‌సభ టికెట్​ ఇవ్వలేదని.. ఎంపీ ఆత్మహత్య

MP Suicide : సిట్టింగ్ లోక్​సభ ఎంపీ సూసైడ్ చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - March 28, 2024 / 10:29 AM IST

MP Suicide : సిట్టింగ్ లోక్​సభ ఎంపీ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో తమిళనాడులోని డీఎండీకే పార్టీ ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ గణేశమూర్తి (77) కన్నుమూశారు. పురుగుమందు తాగి ఆదివారం (మార్చి 24న)  ఆత్మహత్యాయత్నం చేసిన ఆయన కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. హార్ట్​ ఎటాక్​ రావడం వల్ల గణేశమూర్తి(MP Suicide) మరణించారని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. గణేశమూర్తి పార్థివదేహాన్ని పోలీసులకు అప్పగించింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ రోడ్​ ట్రాన్స్​పోర్టు (ఐఆర్​టీ) మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని కుమారవలసు గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join

  • గణేశమూర్తి 2019 సంవత్సరానికి ముందు రెండుసార్లు ఎంపీగా గెలిచారు.
  • 1998లో పళని లోక్​సభ నియోజకవర్గం నుంచి గెలిచారు.
  • 2009లో ఈడోడ్​ స్థానం నుంచి విజయం సాధించారు.
  • 2019 లోక్​సభ ఎన్నికల్లో మారుమలార్చి ద్రావిడ మున్నేత్ర కళగం (డీఎండీకే) తరఫున ఈరోడ్​ నుంచి గణేశమూర్తి పోటీ చేసి గెలిచారు.
  • ఈ ఎన్నికల్లోనూ పోటీచేయాలనుకున్న గణేశమూర్తికి డీఎండీకే అవకాశం ఇవ్వలేదు.
  • గణేశమూర్తి భార్య చనిపోయారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Also Read : Mahabubnagar MLC Polls : మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రారంభం.. ఓటు వేయనున్న సీఎం రేవంత్