CM M K Stalin: తుపాన్ ఎఫెక్ట్, సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

  • Written By:
  • Updated On - December 9, 2023 / 06:10 PM IST

CM M K Stalin: వివిధ ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ చెన్నైను చుట్టివచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తుఫాను కారణంగా కోటి మందికి పైగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందని, తాను సహాయ నిధికి తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి ప్రజలు గురయ్యాయని అన్నారు.

దీంతో ప్రజలు ఉదారంగా విరాళాలు అందించాలని స్టాలిన్ కోరారు. ముఖ్యమంత్రి నిధి బాధిత ప్రజలకు అందించాల్సిన సహాయం అపారమైనది. తమిళనాడు సెక్రటేరియట్ అసోసియేషన్ సభ్యులు ఒక రోజు జీతాన్ని సహాయ నిధికి విరాళంగా అందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ తమ విరాళాలను అందించాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు.