Mysuru: న్యూయర్ వేడుకలకు సిద్ధమవుతున్న మైసూర్ ప్యాలెస్

మైసూరు 2024కి గ్రాండ్ వెల్‌కమ్ కోసం సిద్ధమవుతోంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 04:58 PM IST

Mysuru: 2023 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, మైసూరు 2024కి గ్రాండ్ వెల్‌కమ్ కోసం సిద్ధమవుతోంది. నూతన సంవత్సర వేడుకల కోసం ఉత్సాహభరితమైన సన్నాహాలు జరుగుతున్నాయి. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన సుందరమైన నగరం, శీతాకాలం ఉత్సవ స్ఫూర్తితో అలంకరించబడి ఉంది. ఇది ఇప్పటికే స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది.

డిసెంబర్ 22 నుండి జనవరి 1 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరగునున్నాయి. విద్యుత్ దీపాలంకరణ చేయనున్నారు. ప్రఖ్యాత కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో పండుగ శోభను పెంచుతారు. గతంలో కోవిడ్ కారణంగా సంబురాలు అనుకున్నట్టుగా జరగలేదు. ఈ సంవత్సరం మాత్రం ఘనంగా జరిగే అవకాశాలున్నాయి. మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూరును పరిపాలించిన ఒడయార్లు నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతి పెద్ద భవనాల్లో ఒకటి. ఒడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు.

ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశము. బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కల్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రధాన ద్వారం దగ్గర భారతీయ, యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం సాయంత్రం, పండగ రోజుల్లో విద్యుద్దీపాలంకరణలతో మరింత శోభాయమానంగా ఉంటుంది. మైసూరును చూసేందుకు విదేశీయులు సైతం ఆసక్తి చూపుతుంటారు.