Site icon HashtagU Telugu

AI Cameras At Liquor Shops: మద్యం దుకాణాలలో AI కెమెరాల ఏర్పాటుపై నిషేధం.. కారణమిదే?

AI Cameras At Liquor Shops

AI Cameras At Liquor Shops

AI Cameras At Liquor Shops: మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పైలట్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. దీని కింద మద్యం దుకాణాలు, బార్‌లలో కృత్రిమ మేధస్సు (AI Cameras At Liquor Shops)తో కూడిన హై-రిజల్యూషన్ CCTV కెమెరాలను అమర్చాలి. మైనర్‌లు మద్యం సేవించే సంఘటనలను నివారించడం, కస్టమర్ల వయస్సును అంచనా వేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య‌ లక్ష్యం. అయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

శివసేన మాజీ ఎక్సైజ్ మంత్రి శంభురాజ్ దేశాయ్ హయాంలోనే ఈ AI ఆధారిత కెమెరాలను అమర్చాలని నిర్ణయించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. పూణే, ముంబైలలో మైనర్‌లు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం దారుణమైన ప్రమాదాలకు దారితీసిన రెండు పెద్ద రోడ్డు ప్రమాదాల తర్వాత ఈ పథకం ప్రారంభించారు. పోర్షే కారు నడుపుతున్న 17 ఏళ్ల కుర్రాడు ఇద్దరు బైక్ రైడింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఢీకొట్టిన మొదటి సంఘటన పూణేలో జరిగింది. రెండవ సంఘటన ముంబైలోని వర్లీలో జరిగింద., మద్యం మత్తులో శివసేన నాయకుడు కుమారుడు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఫలితంగా ఒక వ్యక్తి మరణించాడు.

ఈ సంఘటనల తర్వాత మద్యం దుకాణాలు, బార్‌లలో కస్టమర్‌లను గుర్తించడానికి వారి వయస్సును ధృవీకరించడానికి AI- అమర్చిన కెమెరాలను ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ముంబై నుండి ప్రారంభించబడింది. దాని ఫ‌లితాలు ఆధారంగా ఇది మొత్తం రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read: NEET UG 2025: నీట్ 2025 ప‌రీక్ష‌ల‌పై కీల‌క నిర్ణ‌యం.. పెన్‌, పేప‌ర్ ప‌ద్ధ‌తిలో!

ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా లాజిస్టికల్, ఆర్థిక సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మద్యం షాపుల్లో బార్లలో AI కెమెరాలను అమర్చడం, వాటిని సరిగ్గా నిర్వహించడం చాలా పెద్ద పని. కెమెరాలను ఇన్‌స్టాల్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక మద్దతును అందించడం సవాలుగా ఉంది. ఈ అత్యాధునిక కెమెరాలను అమర్చడానికి, నిర్వహించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది.

ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో ఉంచినప్పటికీ.. మైనర్లు మద్యం సేవించకుండా, దానికి సంబంధించిన ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ ఘటనలను అదుపులోకి తీసుకురావడానికి ఇతర ఎంపికలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించగలిగితే భవిష్యత్తులో మళ్లీ అమలు చేయవచ్చని ప్రభుత్వం చెబుతోంది.