కేరళ పెయింటర్ కి అదృష్ట లక్ష్మీ తలుపుతట్టింది. కేరళలోని కుడయంపడి ప్రాంతానికి చెందిన సదానందన్ పెయింటర్ గా జీవనం సాగిస్తున్నాడు. రెక్కాడితే కానీ డోక్కాడని జీవితం సదానందన్ కుటుంబానిది. రోజువారీ పెయింటింగ్ కి వెళ్తే తప్ప కుటుంబ పోషణ జరగదు. అయితే ఉదయం కూరగాయల కోసం మార్కెట్ కు సదానందన్ వెళ్తుంటాడు.
అయితే ఆదివారం కూడా సదానందన్ చికెన్ తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్లాడు. చికెన్ తీసుకుందామని షాప్ కి వెళ్లగా 500 రూపాయలకు చిల్లర లేదని షాప్ అతను చెప్పడంతో సదానందన్ అక్కడి నుంచి బయటికి వచ్చి చిల్లర కోసం చూస్తున్నాడు.ఇంతలో అక్కడే ఉన్న ఓ షాపు వద్దకు వెళ్లి చిల్లర కోసం లాటరీ టికెట్ తీసుకున్నాడు.ఈ లాటరీ టికెట్ సదానందన్ జీవితాన్ని మార్చేసింది. రూ. 12 కోట్ల బంపర్ ప్రైజ్ తగిలింది.
దీంతో ఇప్పుడంతా కుడయంపడిలో సదానందన్ గురించే చర్చించుకుంటున్నారు. లాటరీ డబ్బుతో ఏంచేస్తావని సదానందన్ ను ప్రశ్నించగా, సరైన ఇల్లు కట్టుకుంటామని, మిగతా డబ్బును కొడుకులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉండేందుకు వెచ్చిస్తానని వెల్లడించాడు. కేవలం చిల్లర కోసం వెళ్లడం వల్లే సదానందన్ జీవితం ఈ మలుపు తిరిగింది. అదృష్టం ఇలా కలిసివచ్చింది. అదృష్టం అంటే నీదే సామి అంటూ అందరూ సదానందన్ ని అంటున్నారు.