Karnataka Election: ఆ ఈవీఎంలన్నీ కొత్తవే.. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం..!

కర్ణాటకలో మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Karnataka Election) ఫలితాలు మే 13న వెల్లడికానుండగా, అంతకు ముందు ఈవీఎం మెషీన్‌ (EVMs) కు సంబంధించి కాంగ్రెస్ (Congress) చేస్తున్న వాదనను ఎన్నికల సంఘం (Election Commission) తోసిపుచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Karnataka Election

Evm

కర్ణాటకలో మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Karnataka Election) ఫలితాలు మే 13న వెల్లడికానుండగా, అంతకు ముందు ఈవీఎం మెషీన్‌ (EVMs) కు సంబంధించి కాంగ్రెస్ (Congress) చేస్తున్న వాదనను ఎన్నికల సంఘం (Election Commission) తోసిపుచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election) వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (EVMs) దక్షిణాఫ్రికాలో ఇప్పటికే వినియోగించినట్లు ఎన్నికల సంఘం గురువారం (మే 11) వెల్లడించింది. ఈ ‘నకిలీ సమాచారాన్ని’ ఎవరు వ్యాప్తి చేశారో బహిరంగంగా వెల్లడించాలని కమిషన్ పార్టీని కోరింది. ఈ విషయమై మే 15లోగా కాంగ్రెస్ పార్టీ నుంచి కమిషన్ సమాచారం కోరింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన EVMలు ఇదివరకు దక్షిణాఫ్రికాలో ఉపయోగించినవని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇటువంటి అసత్య ప్రచార వ్యాప్తిని ఆపేయాలని ఎన్నికల సంఘం కోరింది. కర్ణాటకలో మే 10న వినియోగించిన ఈవీఎంలు ఈసీఐఎల్‌ నూతనంగా తయారు చేసినవేనని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం లేఖ రాసింది.

Also Read: 36 Nursing Students: మన్ కీ బాత్ వినలేదని 36 మంది విద్యార్థినులపై చర్యలు

కాంగ్రెస్ నేతలు ఆందోళన

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ తయారు చేసిన కొత్త ఈవీఎంలను వినియోగించినట్లు ఎన్నికల సంఘం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలాకు రాసిన లేఖలో పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాఫ్రికాలో ఉపయోగించిన యంత్రాల రీ-యూజ్‌పై కాంగ్రెస్‌ ఈ నెల 8న కమిషన్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసి వివరణ కోరింది.

‘కాంగ్రెస్‌ మూలాధారాలను వెల్లడించాలి’

ఈవీఎంలను దక్షిణాఫ్రికాకు పంపలేదని, అలాంటి ఈవీఎంలను కమిషన్ ఇక్కడ ఉపయోగించలేదని ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే దాని మూలాలను కూడా పార్టీ బహిర్గతం చేయాలని పేర్కొంది. ఈ క్లెయిమ్‌పై తీసుకున్న చర్యలపై మే 15 సాయంత్రం 5 గంటలలోపు కాంగ్రెస్ పార్టీ నుంచి కమిషన్ సమాచారం కోరింది. కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 స్థానాలకు మే 10న ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఇప్పుడు మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

  Last Updated: 12 May 2023, 07:32 AM IST