Cloudburst: జ‌మ్మూ కాశ్మీర్‌లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. 65 మంది మృతి, 200 మంది గ‌ల్లంతు?

ఈ విషాద ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన కిస్త్వార్ బయలుదేరి రేపు తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాలను స్వయంగా సందర్శించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cloudburst

Cloudburst

Cloudburst: జమ్మూ కాశ్మీర్ కిస్త్వార్ జిల్లాలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో (Cloudburst) 65 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 25 మృతదేహాలను గుర్తించగా, ఇంకా అనేకమంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 200 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సహాయక చర్యలు- నష్టం

ఈ ఆకస్మిక వరదల తర్వాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్బంది 160 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ దుర్ఘటనలో 120 మంది గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Neeraj Chopra: డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా ఎందుకు పాల్గొనడం లేదు?

ముఖ్యమంత్రి పర్యటన

ఈ విషాద ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన కిస్త్వార్ బయలుదేరి రేపు తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాలను స్వయంగా సందర్శించనున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి, సహాయక చర్యల గురించి సమీక్షించనున్నారు. ఇంకా ఎంత సహాయం అవసరమో అంచనా వేసి, తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఈ వరదల నష్టంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  Last Updated: 15 Aug 2025, 04:05 PM IST