Taj Mahal Inspired Mosque : తాజ్మహల్.. భారతదేశంలోని విశ్వ విఖ్యాత ఐకానిక్ కట్టడం. అమెరికా అధ్యక్షుల నుంచి ప్రపంచంలోనే దిగ్గజ సెలబ్రిటీల దాకా ఎవరు ఇండియాకు వచ్చినా తప్పకుండా తాజ్మహల్ సందర్శనకు వెళ్తుంటారు. అంతలా అది వరల్డ్ ఫేమస్ అయ్యింది. అచ్చం తాజ్మహల్ నమూనాలో ఒక భారీ మసీదును మన దేశంలో నిర్మించబోతున్నారు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
తాజ్మహల్ను తలపించే మసీదు ఎక్కడ ? ఎలా ?
- ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో తాజ్మహల్ ఉంది.
- దీన్ని 1631 నుంచి 1648 మధ్యకాలంలో మొఘల్ పాలకుడు షాజహాన్ నిర్మించారు.
- తాజ్మహల్ను తలపించే మసీదు(Taj Mahal Inspired Mosque)ను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఉల్లాల్ పట్టణంలో నిర్మించబోతున్నారు.
- ఉల్లాల్లో ఉన్న సయ్యద్ మహ్మద్ షరీఫుల్ మదనీ దర్గా ప్రాంగణంలో ఈ మసీదును నిర్మించనున్నారు.
- సయ్యద్ మహ్మద్ షరీఫుల్ మదనీ దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది.
- కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు అత్యంత సమీపంలోనే సయ్యద్ మహ్మద్ షరీఫుల్ మదనీ దర్గా ఉంటుంది.
- మసీదు నిర్మాణం కోసం దుబాయ్, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ల సలహాలు, ప్లానింగ్ను తీసుకోనున్నారు.
- రాబోయే రెండేళ్లలో ఈ మసీదు నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఈ మసీదు నిర్మాణానికి రూ.50 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
- మసీదు నిర్మాణ పనులకు అవసరమయ్యే డబ్బులను ముస్లిం కుటుంబాలు, మసీదులు, దర్గాలు, మదర్సాల నుంచి స్వచ్ఛంద విరాళాల రూపంలో సేకరించనున్నారు.
- ఈ మసీదులో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. వీటిలో ఒకేసారి 10వేల మంది నమాజ్ చేయొచ్చు.
- ఈ మసీదులో 8 మినార్లు, 5 గుమ్మటాలు, 5 ఎంట్రీ గేట్లు ఉంటాయి.
- మసీదు లోపలి, బయటి భాగాలను అమృత శిలే రాయితో అలంకరిస్తారు.
- మసీదు ముందు భాగంలో ఒక భారీ నీటి కొలనును నిర్మిస్తారు.